డాక్టర్లు, వైద్య సిబ్బంది సమయ పాలన పాటించాల్సిందేనని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. ఆశ వర్కర్ల నుంచి మొదలు పెడితే, టీచింగ్ హాస్పిటల్స్లో ప్రిన్సిపల్స్ వరకూ ఎవరి డ్యూటీ వారు సక్రమంగా చేయాల్సిందేనన్నారు. డ్యూటీలకు గైర్హాజరైతే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ మేరకు బుధవారం ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు.