బీజేపీ ఆధ్వర్యంలో సంబురాలు
NEWS Mar 05,2025 10:32 pm
ఉమ్మడి కరీంనగర్ - అదిలాబాద్ - నిజామాబాద్- మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఘన విజయం సాధించారు. ఈ సందర్బంగా మల్లాపూర్, వెంపల్లి-వెంకట్రావు పెట్ బీజేపీ ఆధ్వర్యంలో సంబురాలు చేపట్టారు. బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు బైన ప్రశాంత్, బీజేపీ మండల ఉపాధ్యక్షుడు దివాకర్ రెడ్డి, బీజేవైఎం మండల ఉపాధ్యక్షుడు ఆకుల సతీష్, ఎస్టీ మోర్చా అధ్యక్షుడు రాజేందర్ నాయక్, పన్నల శ్రీనివాస్, శ్రీహరి, శక్తి కేంద్రాల ఇంచార్జి, వేముల నరేష్, నలిమేల ప్రసాద్, నరేందర్, అర్వింద్, నవీన్ పాల్గొన్నారు.