లా అండ్ ఆర్డర్ ను కాపాడాల్సిన ఎస్ఐ ఏసీబీకి చిక్కిన సంఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. పేకాట ఆడుతూ పట్టుబడిన 8 మందిపై కేసు నమోదు చేయకుండా వదిలేస్తానని, అందుకు డబ్బులు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడు కోరుట్ల ఎస్ఐ శంకరయ్య. రూ. 5 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి.