ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు సీఎం చంద్రబాబు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి అమిత్ షాను కలిశారు. ఈ సందర్బంగా కీలక అంశాల గురించి చర్చించారు. అనంతరం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి వాకబు చేశారు.