కోరుట్ల పట్టణంలో ఏసీబీ దాడులు జరిగాయి. ఏసీబీ వలలో కోరుట్ల ఎస్సై (3) శంకరయ్య చిక్కారు. పేకాటరాయుళ్ళ వద్ద స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్లు తిరిగి ఇచ్చి 5000/- రూపాయల లంచం డిమాండ్ చేశారు కోరుట్ల ఎస్సై. నేడు బాధితుడు SI కి డబ్బులు ఇస్తుండగా వల పన్ని పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.