సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. బీజేపీకి సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీని ఖతం చేస్తున్నాడని ఆరోపించారు. రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్నగర్ పార్లమెంట్ సీటు, రేవంత్ రెడ్డి సిట్టింగ్ మల్కాజ్గిరి రెండు సీట్లల్లో కావాలని కాంగ్రెస్ పార్టీని ఓడించాడని అన్నారు.ఏడాది పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత ఎందుకొచ్చిందో సీఎం ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. రేవంత్ రెడ్డి కూర్చుకున్న కుర్చీకి పునాది వేసింది తానేనని అన్నారు.