జహీరాబాద్ లోని రాంనగర్ వద్ద ఉన్న బ్రిడ్జి ప్రమాదకరంగా మారింది. జహీరాబాద్ నుంచి తాండూర్ వెళ్లే ప్రధాన రహాదారి కావడంతో రాత్రి సమయాల్లో పెద్ద వాహనాలు వస్తే ద్విచక్ర వాహనాలకు ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని, సైడ్ వాల్ దెబ్బతినడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డు సైడ్ వాల్ మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.