మాజీ మంత్రి ఆర్కే రోజాకు బిగ్ షాక్ ఇచ్చారు మంత్రి రాం ప్రసాద్ రెడ్డి. శాసన మండలిలో కీలక ప్రకటన చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలలో చోటు చేసుకున్న అవకవతకలపై విచారణకు ఆదేశించామన్నారు. ఈ మేరకు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. దీంతో విచారణకు సిద్దంగా ఉండాలని ఈ సందర్బంగా మంత్రి రోజాకు సూచించారు. ఇప్పటికే వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్ట్ కాగా, మాజీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసానిపై 17 కేసులు నమోదయ్యాయి.