పర్యాటకుల గమ్య స్థానంగా ఏపీ
NEWS Mar 05,2025 04:45 pm
ప్రపంచ పర్యాటకుల గమ్యస్థానంగా ఏపీని తీర్చి దిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. జర్మనీ పర్యటిస్తున్నారు. భారత రాయబారితో భేటీ అయ్యారు. పెట్టుబడికి అనుకూలమైన వాతావరణం, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి, బలమైన పర్యాటక మౌలిక సదుపాయాలతో, ఆంధ్రప్రదేశ్ ప్రయాణ, ఆతిథ్య రంగంలో వ్యాపారాలకు అసమానమైన అవకాశాలను అందిస్తుందని వివరించారు.