ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు చేతిలో ఘోరంగా ఓటమి పాలైంది బలమైన ఆస్ట్రేలియా. ఈ బాధ నుంచి కోలుకోక ముందే ఆ జట్టుకు కోలుకోలేని షాక్ తగిలింది. స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ సంచలన ప్రకటన చేశాడు. తాను వన్డేల నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో తప్పుకోవడం ఇదే సరైన సమయం అని తాను భావిస్తున్నట్లు చెప్పాడు. తాజాగా ఈ టోర్నీలో ఆసిస్ జట్టుకు స్కిప్పర్ గా వ్యవహరించాడు.