నాగర్ కర్నూల్ జిల్లాలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనకు సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఆపరేషన్ ఇవాల్టితో 12వ రోజుకు చేరుకుంది. ప్రమాదంలో కన్వేయర్ బెల్ట్ పూర్తిగా ధ్వంసమైంది. దీనిని తిరిగి రీ స్టార్ట్ చేశారు. దీంతో టన్నెల్ లో రెస్క్యూ ఆపరేషన్ ను మరింత వేగవంతం చేశారు. ప్రమాద స్థలంలో 3 నుంచి 8 మీటర్ల వరకు మట్టి, బురద పేరుకు పోయింది. రెండు రోజుల్లో రెస్క్యూ ఆపరేషన్ కొలిక్కి రానుంది.