గత వైసీపీ జగన్ రెడ్డి సర్కార్ పోలవరం ప్రాజెక్టును పట్టించు కోలేదని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. తాము వచ్చాక పనులను తిరిగి ప్రారంభించడం జరిగిందన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం పనులు వేగవంతం చేశామన్నారు. అసాధ్యమనుకున్న విశాఖ స్టీల్ ప్లాంటు సుసాధ్యమైందని చెప్పారు. విశాఖ రైల్వే జోన్ పూర్తి చేసుకున్నామన్నారు. తాము చేసిన ప్రయత్నం వల్ల రాష్ట్రానికి రూ. 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు.