శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు మరింత బాధ్యతగా సేవా భావంతో సేవలు అందించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలకు చెందిన నలుగురు సభ్యుల బృందం సమగ్ర నివేదికను రూపొందించింది. ఈ బృందం ఈవో జె. శ్యామల రావుకు నివేదికను అందించింది. మెరుగైన సేవలు అందించేందుకు ఆధ్యాత్మిక సంస్థల నుండి సలహాలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సదరు సంస్థ తిరుమలలో సర్వే చేసింది. నివేదిక తయారు చేసింది. ఈ రిపోర్ట్ అద్భుతంగా ఉందని, సూచనలు అమలు చేస్తామన్నారు ఈవో.