చెరువులో మునిగి ఇద్దరు మృతి
NEWS Mar 05,2025 08:42 am
చెరువులో మునిగి ఇద్దరు మృతి చెందిన ఘటన న్యాల్కల్ మండలంలో జరిగింది. వివరాలు.. గంగ్వార్ చెరువులో మహారాష్ట్ర లాతూర్కు చెందిన సంజయ్ కామడే (50), SK ఫహీమ్ (17) మునిగి మృతి చెందారు. వీరిద్దరూ ఆరోగ్య సమస్యల కారణంగా ముల్తాని బాబా దర్గా సందర్శనకు వచ్చారు.స్నానం చేసేందుకు చెరువులో దిగగా ఈత రాక మునిగిపోయారు. సంజయ్ శవం లభించగా, ఫహీమ్ కోసం గాలింపు కొనసాగుతోంది. పోలీసులు ఘటనా స్థలంలో దర్యాప్తు చేపట్టారు.