మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నాందేడ్ - అకోలా 161 జాతీయ రహదారి బోడ్ మ్మాట్ పల్లి - చిల్వర మధ్యలో హైవేపై బ్రిడ్జి పై రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్ లో ఎదురుగా వస్తున్న బైకును కారు ఢీకొంది. ఈ ఘటనలో బండ సాయిలు, మణెమ్మ మృతి చెందారు. ,బోడ్ మ్మాట్ పల్లి సంతలో దంపతులు కూరగాయలు అమ్మి తిరిగి ఇంటికి వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.