పోక్సో కేసులోని నిందితుడు అయిన కోరుట్ల మండలం వెంకటాపూర్ కు చెందిన పిట్టల శ్రీధర్ (40)ను మంగళవారం రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. పోక్సో కేసులో నిందితుడైన ఆయన కోర్టుకు హాజరు కాకపోవడంతో జగిత్యాల POCSO కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీంతో నిందితుడిని పట్టుకొని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్టు పేర్కొన్నారు.