ఇది నా గెలుపు కాదు ప్రజల విజయమిది
NEWS Mar 04,2025 06:06 pm
ఎమ్మెల్సీగా విజయం సాధించిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది తన విజయం కానే కాదని ఇది పూర్లిగా ప్రజలు సాధించిన గెలుపు అని అన్నారు. డిక్లరేషన్ ఫామ్ తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. 33 నియోజకవర్గాల్లో ఉన్న 2,41,000 ఓటర్లు నాకు మద్దతు ఇవ్వడం మామూలు విషయం కాదన్నారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగులు, గ్రాడ్యుయేట్ ఓటర్లు ఓటు హక్కు వినియోగించు కోవడం మరింత ప్రజాస్వామ్యం పట్ల నమ్మకాన్ని పెంచేలా చేసిందన్నారు.