మెట్ పల్లి మండలం బండలింగాపూర్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాంను కలెక్టర్ సత్యప్రసాద్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రిజిస్టర్లను పరిశీలించారు. ఈ పాస్ ద్వారా మాత్రమే రైతులకు అమ్మకాలు జరపాలన్నారు. ఓ రైతుకు ఎన్ని యూరియా బస్తాలు ఇస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. స్టాక్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుకోవాలని, ఎమ్మార్పీ ధరలకు మాత్రమే అమ్మకాలు జరపాలన్నారు. ఆయన వెంట పలువురు అధికారులున్నారు.