మిషన్ భగీరథ పనుల పరిశీలన
NEWS Mar 04,2025 06:10 pm
మెట్ పల్లి పట్టణ శివారులో జరుగుతున్న మిషన్ భగీరథ మరమ్మతు పనులను కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వడి నర్సింగరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు జెట్టి లక్ష్మణ్, మండల యువజన అధ్యక్షులు పుల్లూరి వెంకటేష్, రాహుల్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.