నంద్యాల జిల్లాలో బస్సు బోల్తా..మంత్రి ఆరా
NEWS Mar 04,2025 01:38 pm
నంద్యాల జిల్లా కలపటాల వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మందికి పైగా ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు. హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు మంత్రి రాం ప్రసాద్ రెడ్డి. బనగానపల్లె, అవుకు, కొలిమిగుండ్ల ఆస్పత్రులలో మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. ఘటనపై ఆర్టీసీ అధికారులను ఫోన్ లో వివరణ కోరారు.