ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరాబత్తుల విజయం
NEWS Mar 04,2025 01:30 pm
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభధ్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికల ఫలితం ప్రకటించారు. ఈ ఎన్నికల్లో పేరబత్తుల రాజశేఖరం విజయం సాధించారు. 28 టేబుళ్లు 7వ రౌండు నాటికి 1,96,000 ఓట్లు లెక్కింపు పూర్తయింది. ఇందులో 1,78,422 ఓట్లు చెల్లుబాటు కాగా 17 వేల 578 ఓట్లు చెల్లని ఓట్లుగా గుర్తించారు. టీడీపీ బలపర్చిన పేరాబత్తుల రాజశేఖరంకు 1,12,331 ఓట్లు పోల్ అయ్యాయి. పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీర రాఘవులుకు 41 వేల 268 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇద్దరి మధ్య 71,063 ఓట్ల వ్యత్యాసం ఉండడం విశేషం. తనను గెలిపించినందుకు ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు పేరాబత్తుల.