పని చేసే ప్రదేశాలలో మహిళల భద్రత కోసం 2013 పీఓఎస్హెచ్ చట్టం అమలు చేస్తున్నామని చెప్పారు మంత్రి వంగలపూడి అనిత. మండలిలో వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. 2019 -24 వరకు 85 కేసులు నమోదైనట్లు తెలిపారు. 41ఎ సీఆర్ పీసీ/35(3) కింద 72 నోటీసులు జారీ చేశామన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 24 మందిని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు మంత్రి.