సర్పంచ్ హత్య వివాదం నేపథ్యంలో మహారాష్ట్ర మంత్రి ధనుంజయ్ ముండే రాజీనామా చేశారు. తనకు ఆరోగ్యం బాగోలేదంటూ అందుకే తప్పుకుంటున్నట్లు రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు సీఎంను కలిసి అందజేశారు. దీంతో ముండేను కేబినెట్ నుంచి తప్పించినట్లు ప్రకటించారు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. ఆహ్వార , పౌర సరఫరాల శాఖను ధనుంజయ్ ముండే నిర్వహిస్తున్నారు. తన రాజీనామాతో ఈ శాఖను ఎవరికీ కేటాయించ లేదు సీఎం.