సోషియో ఎకనామిక్ సర్వే కీలక ప్రకటన చేసింది. ఆయా రాష్ట్రాలకు సంబంధించిన పేదరిక స్థాయిని అంచనా వేసింది. పేదరికంలో రాష్ట్రాల వారీగా చూస్తే ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో ఉందని వెల్లడించింది. గిరిజన ప్రాంతాల్లోనే పేదరికం ఎక్కువగా ఉందని తెలిపింది. అత్యధిక పేదరిక ఉమ్మడి జిల్లాగా కర్నూలు తర్వాతి స్థానాల్లో విజయనగరం, విశాఖ జిల్లాలు ఉన్నాయని పేర్కొంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో తక్కువ పేదరికం ఉందని స్పష్టం చేసింది. పౌష్టికాహారంలో పదో స్థానంలో ఉండగా. శిశు మరణాల నివారణలో 11వ స్థానంలో ఉందని వెల్లడించింది.