రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మేలు చేకూర్చేలా నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు 1,2 నిమిషాలు ఆలస్యమైనా అనుమతి ఇస్తామని స్పష్టం చేసింది. ఇంటర్ పరీక్షల్లో ప్రతిసారీ విధించే ఈ నిబంధనను సడలించినట్లు తెలిపింది. పరీక్ష రాసే విద్యార్థులు ఉదయం 9 గంటల తర్వాత ఆలస్యంగా వచ్చిన వారిని కూడా పరీక్షకు అనుమతిస్తామని వెల్లడించింది ఇంటర్మీడియట్ బోర్డ్.