జాతీయ పసుపు బోర్డు సెక్రటరీగా నియమించబడ్డ భవాని నిజామాబాద్ లోని జాతీయ పసుపు బోర్డు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. పసుపు బోర్డు జాతీయ చైర్మన్ పల్లె గంగారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. బాధ్యతలు తీసుకున్న వెంటనే జక్రాన్ పల్లి మండలంలోని మనోహరాబాద్ లో గల జేఎంకేపిఎం రైతు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటైన పసుపు ఆధారిత పరిశ్రమను బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డితో కలిసి నూతన బోర్డు సెక్రటరీ సందర్శించారు.