ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా టీమిండియా ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇవాళ జరిగే సెమీస్ నువ్వా నేనా అన్న రీతిలో సాగనుంది. బలమైన పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లను ఓడించింది రోహిత్ సేన. ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కు సంబంధించి టికెట్లు అన్నీ అమ్ముడు పోయాయి. 2023లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో భారత్ ఆసీస్ చేతిలో ఓటమి పాలైంది. ఇప్పుడు ప్రతీకారం తీర్చు కోవాలని అనుకుంటోంది.