కథలాపూర్: ఇటీవల సౌదీలో పోసానిపేట గ్రామానికి చెందిన హన్మంతు హత్య జరిగిన ఘటనపై ప్రభుత్వ విప్, వేములవాడ ఆది శ్రీనివాస్ సౌదీలోని ఇండియన్ ఎంబసీ అధికారులకు లేఖ రాశారు. స్పందించిన అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు రిప్లై ఇచ్చారు. త్వరలోనే గుంట హన్మంతు మృతదేహాన్ని భారత్కు పంపించేందుకు కావలసిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తామని ఎంబసీ అధికారులు తెలిపారు..