ప్రభుత్వ పాఠశాలల్లో సైన్స్ ఫెయిర్
NEWS Mar 03,2025 08:11 pm
మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పోతారంలో సైన్స్ ఫెయిర్ ను నిర్వహించారు. 40కి పైగా విద్యార్థులు ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి కథలాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పులి శిరీష హరి ప్రసాద్ హాజరయ్యారు. సైన్స్ ఫెయిర్ వల్ల చిన్నప్పుటి నుండే పిల్లల్లో వైజ్ఞానిక ఆలోచనలు కలుగుతాయన్నారు. ఈ సందర్బంగా పాఠశాల హెచ్ ఎం, టీచర్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ఇంఛార్జ్ కిషన్ రావు, హెచ్ఎం నరహరి పాల్గొన్నారు.