వడదెబ్బకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
NEWS Mar 03,2025 08:14 pm
MBNR: వడదెబ్బకు గురి కాకుండా ఉండేందుకు డాక్టర్ సలహాలను పాటించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. ఎండ సమయంలో బయటికి వెళ్లకుండా ఉండాలని, తప్పని పరిస్థితి బయటికి వెళ్ళాల్సి వస్తే తలపై టోపీ ధరించి వెళ్లాలన్నారు. సరిపోయినంతగా తాగునీరు తీసుకోవాలని, ఓఆర్ఎస్ పాకెట్లు, నిమ్మరసం, మజ్జిగ, పండ్ల రసాల వంటివి తరచూ తీసుకుంటూ ఉండాలని తెలిపారు.