శ్రీ కేతకీ సంగమేశ్వరస్వామి హుండీ లెక్కింపు
NEWS Mar 03,2025 08:14 pm
ఝరాసంగం మండల కేంద్రంలోని దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కేతకీ సంగమేశ్వరస్వామి దేవస్థానంలో సోమవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. 13 రోజులకు 11 లక్షల 70 వేల 698 హుండీ ఆదాయం వచ్చిందని ఆలయ కార్యనిర్వాహణ అధికారి శివ రుద్రప్ప తెలిపారు. హుండీ లెక్కింపు లో ఇన్స్పెక్టర్ రంగారావు, శేఖర్ పాటిల్, మల్లయ్య స్వామి, రాజరాజేశ్వరి సేవా సమితి సభ్యులు, చెన్నకేశవ సేవా సమితి సభ్యులు, ఆలయ అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు.