కృష్ణా నది జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కృష్ణా జలాలను ఏపీ అన్యాయంగా తరలించుకు పోతోందని చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ కు ఫిర్యాదు చేశామన్నారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు పూర్తి చేయాలని , నిధులు మంజూరు చేయాలని కోరామన్నారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు ఉత్తమ్.