ఏఐడీఎంకే బంగారు నాణెలు ఆఫర్
NEWS Mar 03,2025 04:31 pm
తమిళనాడు రాష్ట్రంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఏఐడీఎంకే కొత్త వ్యూహానికి తెర లేపింది. పార్టీ నేతలు, కార్యకర్తలకు అదిరి పోయే ఆఫర్ ఇచ్చింది. మార్చి 5న తిరుపూర్ జిల్లా ఉత్తుకులిలో ఏఐడీఎంకే మహా సభ నిర్వహించనుంది. సభలో పాల్గొనే ముగ్గురికి లాటరీ పద్దతిలో బంగారు నాణెలు, 300 మందికి గృహోపకరణాలు అందజేస్తామని ప్రకటించింది. ఇదిలా ఉండగా గతంలో ఓ సభలో ప్లాస్టిక్ కుర్చీలను బహుమానంగా ఇచ్చింది పార్టీ.