కోరుట్ల పట్టణానికి చెందిన బొజ్జ నరసయ్య తన ఫోనును గత జనవరి నెలలో కోరుట్లలోని నంది చౌరస్తా సమీపంలో పోగొట్టుకున్నాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కోరుట్ల పోలీసులు సీఈఐఆర్ పోర్టల్ లో వివరాలు నమోదు చేసి అట్టి ఫోన్ ను గుర్తించి సోమవారం బాధితుడికి అందజేశారు. ఈ సందర్భంగా కోరుట్ల ఎస్సై ఎస్. శ్రీకాంత్ మాట్లాడుతూ ఎవరైనా వారి ఫోన్ పోగొట్టుకున్న, దొంగతనానికి గురైన ఫోన్ వివరాలను సీఈఐఆర్ పోర్టల్ లో నమోదు చేస్తే మొబైల్ ఫోను పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.