ప్రశ్నలు వేశారు కనిపంచకుండా పోయారు
NEWS Mar 03,2025 02:13 pm
మంత్రి నారా లోకేష్ సీరియస్ గా స్పందించారు. వైసీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నలు వేశారని కానీ కనిపించకుండా పోయారని సెటైర్ వేశారు. చిత్ర విచిత్రంగా ప్రవర్తించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీకి సంబంధించి ఎప్పుడు నోటిఫికేషన్ వేస్తారంటూ ప్రశ్న సంధించారని కానీ సమాధానం చెప్పినా వినేందుకు ఎమ్మెల్యేలు సిద్దంగా లేక పోవడం తనను బాధ పెట్టిందన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు తాటిపర్తి చంద్రశేఖర్, అమర్ నాథ్ రెడ్డి, విరూపాక్షి, మత్స్యలింగం ఎందుకు ప్రశ్నలు వేశారో వారికేమైనా తెలుసా అంటూ నిలదీశారు.