నిజామాబాద్ జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంపై సోమవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ వ్యక్తి వద్ద నుంచి రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా సబ్ రిజిస్ట్రార్ రామరాజును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో దాడి జరిగింది. ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం లంచం అడిగాడని, బాధితుడు తమను ఆశ్రయించడంతో పట్టుకున్నామన్నారు డీఎస్పీ.