కథలాపూర్ మండలం పోతారం గ్రామానికి చెందిన గొళ్ళెం హన్మక్క (62) కు చెందిన పూరి గుడిసె విద్యుత్ ఘాతం వల్ల నిప్పంటుకొని పూర్తిగా కాలిపోయింది. హన్మక్క ఆ సమయంలో ఇంట్లో లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఇంట్లో ఉన్న నిత్యావసర వస్తువులతో పాటు, బట్టలు పూర్తిగా దగ్ధం అయ్యాయి. ప్రస్తుతం హన్మక్క ఒంటరిగా నివసిస్తుంది.విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్ ధర్మపురి జలందర్ బాధితురాలికి 5000 రూపాయల ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చారు.