పసుపుకు గిట్టుబాటు ధర కల్పించాలి
NEWS Mar 03,2025 06:51 am
మల్లాపూర్: రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతున్నారు. రైతు సుభిక్షంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని, కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు రైతుకు గిట్టుబాటు ధర అందే విధంగా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు నల్ల రాజేశ్వర్ కోరారు. పండించిన పసుపు పంటకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.