ఇంటర్ పరీక్షలకు పక్కడ్బందిగా ఏర్పాట్లు
NEWS Mar 03,2025 03:59 am
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు.ఈ నెల 5వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఇంటర్ వార్షిక పరీక్షల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో సీ.ఎస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. ఎలాంటి పొరపాట్లకు, కాపీయింగ్ కు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో సాఫీగా పరీక్షలను నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.