ఘనంగా వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణం
NEWS Mar 03,2025 09:23 am
ధర్మపురి పట్టణంలోని శ్రీశ్రీశ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయంలో వీర బ్రహ్మేంద్ర స్వామి, గోవిందమాంబల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ, అర్చకులు లక్ష్మణ్ కు ప్రసాదం, చిత్ర పటాన్ని అందజేశారు. శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.