మల్లాపూర్కు చెందిన మానాల అశోక్ దుబాయ్లో గత 3 నెలల క్రితం ప్రమాదంలో మరణించాడు. ఆర్థిక పరిస్థితి బాగోలేదని తెలుసుకున్న 'అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్' పుల్ల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సాయం చేశారు. సరుకులు పంపిణీ చేశారు. ఇల్లెందుల శ్రీధర్-శ్రీలత (జగ్గాసాగర్) దంపతుల పెళ్లి రోజు సందర్భంగా వారికి, ఎస్సై రాజు చేతుల మీదుగా నిత్యావసర సరుకులు అందచేశారు. నిస్సాహయులకు తమ ట్రస్టు సాయం చేస్తుందని పుల్ల శ్రీనివాస్ గౌడ్ చెప్పారు.