కోరుట్ల మండలం యూసఫ్ నగర్ గ్రామంలో ప్రతి సంవత్సరం శివరాత్రి అనంతరం నిర్వహించే బద్ది పోచమ్మ బోనాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మహిళలు ఊరేగింపుగా పెద్ద ఎత్తున బోనాలు తీసుకెళ్లి బద్ది పోచమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మహిళలు , గ్రామ ప్రజాప్రతినిధులు బద్ది పోచమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ డైరెక్టర్ గుగ్గిళ్ళ సురేష్ గౌడ్ పాల్గొన్నారు.