క్లౌడ్ పార్టికల్ స్కామ్ లో సుఖ్విందర్..డింపుల్ అరెస్ట్
NEWS Mar 02,2025 07:26 pm
రూ.3,558 కోట్ల 'క్లౌడ్ పార్టికల్ స్కామ్'లో కీలక నిందితులుగా భావిస్తున్న సుఖ్వీందర్, డింపుల్ ఖరూర్లను ఢిల్లీ ఐజిఐ విమానాశ్రయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) అరెస్టు చేసింది. ఆర్థిక మోసానికి పాల్పడినట్లు ఇప్పటికే దర్యాప్తు సంస్థ గుర్తించింది. దేశం విడిచి పారిపోయే ప్రయత్నంలో ఉన్న వీరిని అదుపులోకి తీసుకుంది. నిర్దిష్ట నిఘా సమాచారం మేరకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఎల్ఓసీ ఆధారంగా వారిని అరెస్ట్ చేశారు.