వైద్య శిబిరానికి అనూహ్య ఆదరణ
NEWS Mar 02,2025 06:04 pm
ఎస్ త్రీ ఆస్పత్రి యాజమాన్యం , బిగ్ టీవీ ఛానల్ సంయుక్త ఆధ్వర్యంలో జహీరాబాద్ పట్టణం శాంతినగర్ కాలనీ హనుమందిరం ఆవరణలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు చేపట్టారు. ఈ వైద్య శిబిరంలో రోగులకు కావలసిన షుగర్ టెస్ట్, బీపీ, జెనరల్ చెక్కప్స్ వంటి తదితర రోగాలను పరీక్షించారు. రోగులకు ఉచిత మందులను అందజేశారు.