మాజీ స్పీకర్ దివంగత శ్రీపాద రావు జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ లో కరాటే పోటీలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి పోటీలను చేపట్టారు. ఈ పోటీలను ధర్మపురి ఎమ్మెల్యే మద్దూరి లక్ష్మణ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభించారు. కరాటే పోటీలలో విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.