ఏపీ కూటమి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. మాజీ సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ ను సస్పెండ్ చేసింది. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. 2020 - 2024 మధ్య సునీల్ కుమార్ ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా, అఖిల భారత సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించి అనేకసార్లు విదేశాలకు వెళ్లారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సస్పెన్షన్ వచ్చింది.