అందోల్:చౌటాకూర్ మండలం బొమ్మ రెడ్డి గూడెం గ్రామ పరిధిలో ఉన్న కోళ్ల ఫామ్ లో మూడు రోజుల వ్యవధిలో 6 వేల కోళ్లు మృతి చెందడం స్థానికంగా కలకలంగా మారింది. దీంతో గ్రామంలోని కోళ్లకు బర్డ్ ఫ్లు సోకిందని స్థానికులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. బొమ్మ రెడ్డి గూడెం లో ఉన్న సుగుణ పౌల్ట్రీ ఫార్మ్ లో 9 వేల 600 కోళ్లు ఉన్నాయి. ఇందులో మూడు రోజుల వ్యవధిలోనే 6 వేల కోళ్లు మృతి చెందాయి.పౌల్ట్రీ ఫామ్స్ లోని కోళ్లు వైరస్ బారినపడి మృతి చెందడంతో యజమాని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.