మాజీ శాసనసభ స్పీకర్ స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదరావు జయంతి సందర్భంగా కరీంనగర్ బస్టాండ్ వద్దగల విగ్రహానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి , నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో కలిసి పూలమాల వేశారు. శ్రీపాదరావుతో కలిసి తాను పనిచేసిన సందర్భాలను జీవన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ప్రతినిత్యం పేదల కోసం శ్రీపాదరావు ఆలోచించేవాడని అన్నారు.