సీఎం రేవంత్ రెడ్డి వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. రూ. 721 కోట్ల విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు. ఇందిరమ్మ మహిళా శక్తి, రేవంతన్న భరోసా పథకాన్ని ప్రారంభిస్తారు. లోన్ మేళా ద్వారా లబ్దిదారులకు చెక్కుల పంపిణీ చేస్తారు. జాబ్ మేళా ద్వారా నియామక పత్రాలను అందించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రజా పాలన ప్రగతి బాట బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సీఎం పర్యటన సందర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు.