MBNR: పీఎంశ్రీ ద్వారా జిల్లాలోని పాఠశాలలకు మంజూరైన నిధులను ఖర్చు చేసి వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో సమగ్ర శిక్ష ప్రాజెక్టు, పీఎంశ్రీ ద్వారా మంజూరైన నిధుల వినియోగం తదితర విషయాలపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.